28.7 C
Hyderabad
April 26, 2024 10: 19 AM
Slider హైదరాబాద్

మౌలికవసతుల కల్పనకు ప్రధమ ప్రాధాన్యం

#RoadWorks

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ వివేకానంద నగర్ లోని సుమిత్రానగర్ లో సుమారు 96 లక్షల రూపాయలతో ఏర్పాటు సిసి.రోడ్డును నిర్మాణ పనులను కార్పోరేటర్ యం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు పరిశీలించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వివేకానందనగర్ 122 డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రజలకు మౌలికవసతుల కల్పన విషయంలో ఒక పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ప్రతి కాలనీ, బస్తి అభివృద్ధికి ముందుగా డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ పనులు పూర్తి చేసి, సీసీ రోడ్డు పనులను చేపడతామని తెలిపారు.

అలాగే మిగతా పనులు కూడా అతి త్వరలో పూర్తి  చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, నాయకులు తీగల కృష్ణా రావు, సుర్యప్రతాప్ రెడ్డి, డి.శ్రీను, శ్రీనివాస్, రమేష్, గోపాల్, మోహన్, మధుసుధన్, గాల్ రెడ్డి, రాంచందర్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐదు కుటుంబాలకు డ్రై రేషన్ అంద‌జేత‌

Sub Editor

హరిద్రా అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

Satyam NEWS

ఎంఎల్ఆర్ఐటీలో ఐషాకు ఘ‌న స‌త్కారం

Satyam NEWS

Leave a Comment