త్రయోదశి సందర్భంగా ఆదివారం ఉదయం పాత శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మ వారికి విశేష పూజలు నిర్వహించారు.
సర్వ మానవాళి అమ్మ వారి ఆశీస్సులు పుష్కలంగా పొంది సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
త్వరగా కరోనా తగ్గి పోవాలని కోరుతూ లోక కళ్యాణార్థం ఈ పూజలు నిర్వహించినట్లు అలయ అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తెలిపారు.
శ్రీ దుర్గ అమ్మవారికి కుంకుమ పూజ అత్యంత వైభవంగా జరిగిందని ఆయన తెలిపారు.
పాత శ్రీకాకుళం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆయన తెలిపారు.