31.2 C
Hyderabad
May 2, 2024 23: 11 PM
Slider హైదరాబాద్

దళిత బంధు పథకం దళితులు జీవితాలలో వెలుగులు

#uppal

దళిత బంధు పథకం దళితులు జీవితాలలో వెలుగులు నింపాలని, సామాజిక మార్పు, పేదల సంక్షేమమే ధ్యేయంగా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్ కు చెందిన దళిత బంధు లబ్ధిదారుడు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంటి కృష్ణ కు మంజూరు అయిన కారును ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి లబ్ధిదారుడు కుంటి కృష్ణకు తాళాలు అందించి మిఠాయి తినిపించి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మార్పు, పేదల సంక్షేమమే ధ్యేయంగా దళిత బంధు పథకాన్ని సి ఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పెట్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ ,
మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ లేతకుల రఘుపతి రెడ్డి, నాయకులు ఫైళ్ల ప్రవీణ్, కోసం మహిపల్ రెడ్డి, శీలం ప్రవీణ్, పల్లె నర్సింగ్ రావు, కుమారా స్వామి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ప్రతి ఒక్కరు మెచ్చే “ఇద్దరు”: సోని చరిష్టా

Satyam NEWS

ఉప్పల్‌లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ: నేర్ధం భాస్కర్‌గౌడ్‌

Satyam NEWS

యువతికి అండగా నిలిచిన దిశ పోలీసులు

Bhavani

Leave a Comment