నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రంగినేని అభిలాష్ రావు కోవిడ్ నుంచి త్వరగా కోలుకోని, పార్టీ కి సేవలు అందించాలని నేడు కొల్లాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి పేరు మీద రామమందిరం లో పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఖాదర్ బాషా దర్గా లో ప్రార్థనలు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమం లో టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాబా, జనరల్ సెక్రటరీ గోపాల్, టౌన్ యూత్ నాయకులు కురుమయ్య, సీనియర్ నాయకులు శీలం వెంకటేష్, మధు, మహమ్మద్, రాజేష్, భరత్, మాసూమ్, సోహెల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.