37.2 C
Hyderabad
May 2, 2024 14: 05 PM
Slider కృష్ణ

ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు

#vijayawada

రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ చలో విజయవాడ కార్యక్రమానికి స్పందించి రావడంతో విజయవాడ జన సముద్రంగా మారింది. ఒక్కసారిగా ఉద్యోగులు ఉప్పెనలా తరలిరావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. బీఆర్‌టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి అగ్రభాగాన పీఆర్సీ సమితి ముఖ్య నేతలు నిలిచారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఛేదించుకుని మరీ ఉద్యోగులు దూసుకెళ్లారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమని వెంటనే విడుదల చేయాలంటూ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. విజయవాడ నగరం వెలుపలే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు. అయినా విజయవాడలో ఉద్యోగులు ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చారు.

Related posts

కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారు

Satyam NEWS

పెద్ద దర్గా ఉరుసుకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు

Sub Editor

ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టి‌ఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

Leave a Comment