ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు తప్పక న్యాయం చేస్తారని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మిర్చి పంట నష్టం, ధాన్యం కొనుగోలు తదితర రైతు సమస్యలపై వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష రైతు సంఘాల (జేఏసీ) జాయింట్ యాక్షన్ కమిటీ ఎంపితో సమావేశమైంది. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని, రైతులకు మేలు జరుగుతందని తెలిపారు. రైతుల సమస్యలను ఎంపీ సంబంధిత అధికారులకు వివరించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
next post