తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాలతో సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి తిమ్మప్ప దేవాలయంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తిమ్మప్ప స్వామిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఈవో సత్య చంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి నరేందర్ సర్పంచ్ యాకోబు ఉపసర్పంచ్ చీకిన మల్డకల్,ఎలుక వెంకటన్న నిమ్మకాయల గోవిందు ,పూజారి నర్సింహులు, నాయకి మధు, వాల్మీకి పూజారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.