కడప జిల్లా రాజంపేట మండలంలోని అన్నమయ్య ప్రాజెక్టు నిండడం తో చెయ్యేటి లోనికి రెండు గేట్లు ద్వారా ఆదివారం సాయంత్రం నీటిని వదిలారు.
అన్నమయ్య డ్యామ్ పైన ఉన్న పించ డ్యామ్ గేట్లు ఎత్తడం వలన నీటి ప్రవాహం 2500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీనితో అన్నమయ్య డ్యామ్ కెపాసిటి 202. 23948 మీటర్లుకు పూర్తి స్థాయిలో నీరు చేరు కుంది.
ఈ అన్నమయ్య డ్యామ్ రెండు గేట్ల ద్వారా 2300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. దిగువున ఉన్న రాజంపేట, నందలూరు, పెనగలూరు,మండలాల ప్రజలకు భూగర్భ జలాలు పెరిగి తాగడానికి, సాగు నీటి సమస్య ఉండదు.
దీనితో చుక్క నీరు లేక ఎండిపోయిన చెయ్యరు నీటితో కళకళ లాడానుంది. దీనితో దిగువ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తం ఔతోంది. కాగా శనివారం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 10 చెరువులకు నీటిని వదిలారు.