యాదాద్రి భవనగిరి జిల్లా లో భారీ బంగారం పట్టుపడింది.
చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో బంగారం దొరికింది.
ఈ బంగారం విలువ సుమారు 12 కోట్ల విలువ కలిగి ఉంటుందని అధికారులు చెప్పారు. డీఆర్ఐ అధికారులు పట్టుకున్న ఈ మొత్తం బంగారం బరువు 26 కిలోలు.
ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరకడం చాలా అరుదు. ముగ్గురు స్మగ్లర్లు ఈ బంగారాన్ని కలకత్తా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు.
చెన్నై లో డెలివరీ చేసే పని కలకత్తా ముఠా వీరికి అప్పగించిందట.