భద్రాచలంలో శ్రీ శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కెవి రమణ చారి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , మహబూబాద్ ఎంపీ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భద్రాచలం దేవస్థానం ఈవో నరసింహులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.