ఈనెల ఎనిమిదో తేదీ నుండి 30వ,తేదీ వరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్ ల రద్దు,కనీస వేతనం 24000 కోసం జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోశపతి డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు టౌన్ కమిటీ సమావేశంలో రోషపతి మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీ భారతదేశంలో మొదటిసారిగా సిపాయిలు తిరుగుబాటు చేసింది 8 సెప్టెంబర్ 1857 అని,నాడు జరిగిన తిరుగుబాటు భారతదేశ స్వాతంత్య్రం కోసం అని,నేడు జరిగే పోరాటం రైతు కార్మిక చట్టాల రద్దు కోసం అని అన్నారు.కేంద్ర,రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుగుబాటుకి ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి చట్టాలను రద్దు చేయాలని, కేంద్రంలోని ప్రభుత్వ సంస్థలను, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని,కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటానికి ఈ పాదయాత్రకు సంఘీభావం తెలియ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యల్క సోమయ్య గౌడ్,ఉపతల గోవిందు,శీతల చందు, గుండెబోయిన వెంకన్న,గుగ్గిళ్ళ సైదులు, లింగయ్య,కోటమ్మ,ఉమ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్