శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణం సందర్భంగా ఫణీగిరి గుట్ట వద్ద ఆదివారం వద్దకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. పాతః కాలంలో నిత్య హోమం, ప్రాబోధిక కార్యక్రమాలు జరిగాయి. శ్రీరామ,లక్ష్మి,రామానుజ,అష్టోత్తరాలు, తిరుప్పావై సేవా కాలం పఠించారు. స్వయం వ్యక్త శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.పల్లకిలో అధిష్టింపజేసి మేళతాళాలతో ఫణిగిరి చుట్టూ ప్రదక్షిణం గావించారు.బలిహరణ చేసి భక్తుల గోత్రనామాలతో అర్చకులు విశేష పూజలను చేశారు.
స్వామి వారి కళ్యాణం సందర్భంగా ఆలయ శిఖరానికి రంగు రంగులతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సమితి సభ్యులు,ఆలయ అర్చకులు, స్థానాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్