హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం నుంచి సోమవారం నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క సారలమ్మ జాతరతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో వన దేవతల ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభమై పస్రా, చల్వాయి, జంగాలపల్లి మీదుగా రామప్ప ఆలయం వరకు మొదటి రోజు కొనసాగనుంది.
previous post