37.2 C
Hyderabad
April 26, 2024 19: 58 PM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా నడిపేన

#rkrishnayya

బీసీల అభ్యున్నతికి, పటిష్ఠానికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా నియమితులైన విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు  ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ,రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నడిపే న  శ్రీనివాసరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు శాలువా కప్పి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేశ్, రాష్ట్ర కన్వీనర్ పితాని ప్రసాదు, పలువురు బీసీ సంఘం నేతలు నూతనంగా నియమితులైన విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం  అధ్యక్షులు నడిపే న శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నడిపే న శ్రీనివాసరావు మాట్లాడుతూ   తనకు పదవి రావడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,  జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని, తన పాదయాత్రలో బీసీలకు అన్ని విధాల న్యాయం చేస్తానని ఇచ్చిన హామీలకు అనుగుణంగా అధికారం చేపట్టిన తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సంక్షేమంలో 50 శాతం బీసీలకు అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా త్వరలోనే పర్యటించి బీసీలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండే విధంగా కృషి చేస్తానని అన్నారు..

Related posts

చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే మేడా కు లేదు

Satyam NEWS

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఇదే కదా ప్రేమంటే….

Satyam NEWS

Leave a Comment