28.7 C
Hyderabad
April 26, 2024 09: 40 AM
Slider ముఖ్యంశాలు

విశ్వనాథ్‌ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి

#viswanath

ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌  మరణం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని మంత్రి పువ్వాడ కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చాన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసకువచ్చారన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఆయన చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయని, విశ్వనాథ్‌  మహాభినిష్క్రమనం తెలుగు సినీరంగానికి తీరని లోటని వారు అన్నారు. విశ్వనాథ్‌  ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Related posts

బ్లాక్ షిప్:రాజన్నహుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

Satyam NEWS

పేద పూజారి కుమార్తె ఇప్పుడు భారత దేశ ఆశాజ్యోతి

Satyam NEWS

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది

Satyam NEWS

Leave a Comment