శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఈ నెల 14 నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభించనున్నట్లు నాగార్జున సాగర్ బోటింగ్ యూనిట్ మేనేజర్ హరి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ ప్యాకేజీలో వచ్చే వారిని టూరిజం బస్సులో హైదరాబాద్ నుంచి సాగర్కు తీసుకొచ్చి, సాగర్ నుంచి శ్రీశైలం తీసుకెళ్తామన్నారు. శ్రీశైలం నుంచి తిరిగి టూరిజం బస్సులో హైదరాబాద్ చేరుస్తామన్నారు.
మరింత సమాచారం కోసం సెల్: 9848540371, 7997951023లను సంప్రతించాలన్నారు.