అంగన్ వాడి టీచర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలని, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపి ఆధ్వర్యంలో అంగన్ వాడి టీచర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్ వాడి కార్యకర్తల నిరసన కార్యక్రమం చేపట్టారు.
సీపీఎం అనుబంధ సంస్ధలు సి.ఐ. టి.యూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తం గా ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా సి.ఐ. టి.యూ కార్యదర్శి చిట్వేల్ రవి, రాజంపేట అంగన్ వాడి టీచర్స్ యూనియన్ అధ్యక్షరాలు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెండింగులో ఉన్న బాడుగ అంగన్ వాడి కేంద్రాల బాడుగలు చెల్లించాలని వారు వినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.