ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరగబోతున్నాయని వస్తున్న వార్తలు నిరాధారమైనవి. వాట్సప్ లలో ఉదయం నుంచి సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజిలో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఇలాంటి మెసేజీలు రావడం ప్రజలను పక్కదోవ పట్టించడానికేనని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇలాంటి తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నదని ఆయన తెలిపారు.
ఇది కేవలం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పదోవ పట్టించడానికి మాత్రమే పనికి వస్తుందని ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు.
1 comment
Ysr