హైద్రాబాద్ లోని వెస్టర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన 20-20 క్రికెట్ మ్యాచ్లో ఆల్ స్టార్ ఛాంపియన్స్ జట్టు తరపున సెంచరీ సాధించిన విద్యార్థి యలక అవినాష్ గౌడ్ ను ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాసరెడ్డి అభినందించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన అవినాష్ అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్ పశ్యా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేవలం 32 బంతులలో 6 ఫోర్లు,12 సిక్సులతో వ్యక్తిగతంగా 104 పరుగులు సాధించి జట్టును ఒంటి చేత్తో గెలిపించడం గొప్ప విషయం అన్నారు.ఇలాంటి క్రికెట్ క్రీడాకారుడు తమ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నందుకు ఇది తాము గర్వించదగ్గ విషయమన్నారు.భవిష్యత్తులో యలక అవినాష్ గౌడ్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదిస్తాడని ఆకాంక్షించారు.అవినాష్ గౌడ్ ను ఈ ప్రాంత ప్రజలు అందరూ అభినందించి, ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంచార్జి బాల సైదులు,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్