29.7 C
Hyderabad
May 4, 2024 04: 19 AM
Slider నల్గొండ

బత్తాయి, నిమ్మ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

#Mango Crop

టన్నుకు రూ.30 వేలు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా బత్తాయి, నిమ్మ, మామిడి కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధి లో నేడు  ఉయ్యాల  స్వామికి చెందిన  మామిడి నిమ్మ తోట ను పరిశీలించిన అనంతరం ఆ రైతు తో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిసాన్ మోర్చా చికిలంమెట్ల అశోక్  భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల అధ్యక్షులు పొట్ల పెళ్లి నరసింహ గౌడ్ మరియు మహిళా రైతులతో కలిసి  దీక్ష చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించాలి

ఎగుమతులకు అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా డాక్టర్లకు పోలీసులకు కార్మికులకు హాస్టళ్లకు  ప్రభుత్వమే నేరుగా పంపిణీ చేయాలని వారు కోరారు. కరువు నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి వీటికి కేటాయించాలని బిజెపి డిమాండ్ చేసింది. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు.

Related posts

గౌడ్ లు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలి

Satyam NEWS

గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడికి సన్మానం

Satyam NEWS

కెసిఆర్ హామీలన్నీ అబద్దాలే

Bhavani

Leave a Comment