తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నేడు సన్మానం చేశారు.
హుజురాబాద్ మొట్టమొదటిసారిగా చంద్రశేఖర్ గౌడ్ వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని వెహికల్ కార్యాలయానికి తనిఖీ నిమిత్తం ఆయన వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో ఆయనను కలసిన తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను శాలువాతో సన్మానించారు.
గ్రూప్ వన్ అధికారుల సమస్యలను చాలా వరకు సంఘం ఆధ్వర్యంలో పరిష్కారం అయినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ దృష్టికి ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
చాలా సమస్యలు పరిష్కరించడంలో చీఫ్ సెక్రటరీ అన్ని రకాలుగా సహకరించటం హర్షణీయమని ఆయన అన్నారు.