28.7 C
Hyderabad
April 26, 2024 08: 34 AM
Slider కరీంనగర్

గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడికి సన్మానం

#grouponeofficers

తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నేడు సన్మానం చేశారు.

హుజురాబాద్ మొట్టమొదటిసారిగా చంద్రశేఖర్ గౌడ్ వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని వెహికల్ కార్యాలయానికి తనిఖీ నిమిత్తం ఆయన  వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో ఆయనను కలసిన తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను శాలువాతో సన్మానించారు.

గ్రూప్ వన్ అధికారుల సమస్యలను చాలా వరకు సంఘం ఆధ్వర్యంలో పరిష్కారం అయినట్లు ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ దృష్టికి ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

చాలా సమస్యలు పరిష్కరించడంలో చీఫ్ సెక్రటరీ అన్ని రకాలుగా సహకరించటం హర్షణీయమని ఆయన అన్నారు.

Related posts

అధికారం కోసం అన్నీ మోసాలే చేసిన కేసీఆర్

Bhavani

హుజూర్ నగర్ పశు సంరక్షణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

Satyam NEWS

తీవ్ర వ్యాఖ్యలు చేసిన డిజిటల్ డైరెక్టర్ పై ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment