25.7 C
Hyderabad
May 24, 2025 08: 47 AM
Slider ఆదిలాబాద్

బాలాజీ అనుకోడా స్మశానవాటిక నిర్మాణం నిలిపివేయాలి

#Asifabad District

కొమరంబీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండలం బాలాజీ అనుకోడా గ్రామo లో అంపుడు చెరువు లో నిర్మిస్తున్న స్మశానవాటిక ను నిలిపివేయాలని గ్రామస్థులు తహసీల్దార్ కాజా నియోధిన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా స్మశానవాటిక నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.

రైతులకు ఉపయోగపడే అంపుడు చెరువు లో స్మశాన వాటిక నిర్మాణం తగదని వారు అన్నారు. ఈ చెరువు కు మూడు సంవత్సరాల క్రితం గండి పడింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 47 లక్షల రూపాయల మంజూరు చేసి టెండర్ కూడా పూర్తి చేసింది. కానీ పనులు మొదలు పెట్టిన గుత్తే దారులు మధ్యలోనే పనులు నిలిపివేశారు. ఇప్పుడు అదే చెరువులో అధికారులు స్మశానవాటిక నిర్మాణం చేపడుతున్నారని వారు అన్నారు.

చెరువులో కాకుండా వేరే ప్రాంతలో ఈ స్మశానవాటిక నిర్మాణం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కుకాడ్కార్ రమేష్ ,డబ్బుల గంగారాం సంజీవ్, జుంగారి శేఖర్, రమేష్ గౌడ్,ఉమ మహేష్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తర కర్ణాటకలో భారీ వర్షంతో కల్లోలం

Satyam NEWS

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నానికి గౌడ సంఘం ఖండన

Satyam NEWS

రఘురామ లేఖపై స్పందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!