ఆంధ్రప్రదేశ్ లో కరోనా వీరవిహారం తగ్గడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. అతన్ని తక్షణమే తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టారు.
చిత్తూరుకు సంబంధించి 8 మండలాలు రెడ్ జోన్ గా ప్రకటించారు. శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.