వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనువాసరావు కు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు కరోనా పాజిటీవ్ వచ్చింది.
ప్రస్తుతం కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. కొన్ని రోజులు నుంచి జలుబు, దగ్గు ఉండడంతో చికిత్స చేయించుకోగా కరోనా పాజిటివ్ తేలింది. గన్ మెన్ ని కూడా హోం క్వారంటైన్ లో ఉండమని ఎమ్మెల్యే సుధాకర్ సూచించారు.