31.7 C
Hyderabad
May 2, 2024 07: 22 AM
Slider వరంగల్

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్య

#bhoomika

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన తన్నీరు భూమిక ( 15) పదో తరగతి చదువుతుంది 

ఈ క్రమంలో విద్యార్థిని ఆన్లైన్ క్లాసులు సరిగా  వినడం లేదని  తల్లిదండ్రులు భూమికను మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన భూమిక శుక్రవారం మధ్యాహ్నం శానిటైజర్ తాగి అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన   భూమికను ములుగు జిల్లా కేంద్రం లోని  ఏరియా ఆసుపత్రి  కి తరలించి  చికిత్స అందిస్తున్నారు. 

చికిత్స పొందుతూ  విద్యార్థిని  బుధవారం   మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆనందయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  ప స ర ఎస్సై తెలిపారు.

Related posts

భారత్ కు ఇచ్చిన గౌరవం పాకిస్తాన్ కు కూడా ఇవ్వాలి

Bhavani

మల్దకల్ దేవాలయ అభివృద్ధికి సహకరించండి

Bhavani

జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర

Murali Krishna

Leave a Comment