అనారోగ్యంతో మరణించిన మహిళ అంతిమ యాత్రలో ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పాల్గొన్నారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన బండారి స్వాతి అనే వివాహిత అనారోగ్యంతో మరణించారు. ఆమెకు రెండు సంవత్సరాల పాప ఉంది. విషయం తెలుసుకున్న తస్లీమా మృతురాలి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిన్న పాప రోదనను చూసి కంట కన్నీరు కార్చారు. ఇంత చిన్న వయసులో తల్లిని కోల్పోవడం బాధాకరమని తస్లీమా అన్నారు. దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి,అంతిమ యాత్రలో పాల్గొన్నారు.