నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటి పట్టణ కేంద్రంలోని12వ వార్డు లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్ ఖాన్ కోరారు. అదేవిధంగా తుప్పు పట్టిన ఇనుప స్తంభాలను కూడా తొలగించాలని గురువారం విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేశారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను నుండి వార్డు ప్రజలకు ఎవరికి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో తెలిపారు. దీనిపై విద్యుత్ శాఖ AE వెంకటయ్య స్పందించారు. తమ పరిధిలో ఉన్న సమస్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ స్తంభాలను పరిశీలన చేస్తామన్నారు. సర్వే చేసి పై అధికారులకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ కొల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కాకి సత్యనారాయణ గౌడ్, పింన్నంశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.