29.7 C
Hyderabad
May 4, 2024 04: 20 AM
Slider మహబూబ్ నగర్

మహిళల న్యూడ్  ఫొటోస్ రికార్డ్ సంఘటన పై విచారణ

#gadwalsp

కొందరు వ్యక్తులు మహిళల న్యూడ్ వీడియో కాల్స్ ఫొటోలు తీసి బ్లాక్ మెల్ చేస్తున్నారని నిన్నటి నుండి సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశం మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశం అయినందున ఎవరైనా సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తే వారి పై కూడ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్ పి జె. రంజన్ రతన్ కుమార్ హెచ్చరించారు.

ప్రచార మద్యమాలలో ప్రచారం అవుతున్న ఈ అంశం గురించి ఎవరు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకున్నా పోలీస్ యంత్రాంగం సుమోటో గా తీసుకొని కేసు నమోదు చేసిందని చెప్పారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారని, ఇప్పటికే ఒకరిని రిమాండ్ చేయగా మరింత లోతుగా విచారణ జరుగుతున్నదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎవరి ఫోన్ లకు అయినా అనుకోకుండా ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు వచ్చినా, ఫోన్లో ఉన్న వెంటనే డిలీట్ చేయాలి తప్ప షేర్ చేయడం గాని, సన్నిహితులకు పంపడం గాని చేస్తే మాత్రం పోలీస్ సోషల్ మీడియా టీమ్ ద్వారా గుర్తించి క్రిమినల్ చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Related posts

ఉదారత చాటుకున్న ఏపీ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం

Bhavani

మన రాజ్యాంగాన్ని పౌరులు అందరు గౌరవించాలి

Satyam NEWS

మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని పరిశీలించిన మంత్రి

Satyam NEWS

Leave a Comment