నిర్మల్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. కార్యాలయం ఆవరణంలో గల ప్రదేశాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు.
రూ 75 లక్షలతో భవనాన్ని ఆధునికీకరణ చేస్తామన్నారు. కార్యాలయం ముందు వాటర్ ఫౌంటైన్, పచ్చని చెట్లను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలక్రిష్ణ, DE సంతోష్ ,TRS టౌన్ ప్రెసిడెంట్ రాము, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.