34.2 C
Hyderabad
May 13, 2024 16: 57 PM
Slider చిత్తూరు

పోలీసుల బెదిరింపు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం

#chandragiri

తిరుపతి జిల్లా చంద్రగిరి లో జరిగిన ఒక దారుణమైన సంఘ్తన ఇప్పుడు వైరల్ గా మారింది. చంద్రగిరి చెందిన మణికంఠ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే చంద్రగిరి చెందిన మణికంఠకు అతని భార్య భార్గవికి కొంతకాలం క్రితం నుండి విభేదాలు నడుస్తున్నాయి. తన భార్య ఇతన్ని కాదని భాషా అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండడంతో మనోవేదనతో ఉన్నాడు మణికంఠ. పైగా ఈ వ్యవహారానికి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్ శ్రీనివాసు కూడా సహకరించాడు అని తెలుసుకున్న మణికంఠ, కేసు పెట్టమని అడగగా నీ మీదే దొంగ కేసు పెట్టి లోపల వేస్తానని బెదిరించాడు.. దీనితో మనస్థాపం చెందిన మణికంఠ ఇక బ్రతికి ఉపయోగం లేదనుకుని పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు.

Related posts

జీతాల్లో కోత విధించేందుకు ఇది ఆర్ధిక ఎమర్జెన్సీ కాదు

Satyam NEWS

25న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన మావోలు

Satyam NEWS

రోకలితో కొట్టి తండ్రిని చంపిన కొడుకు

Bhavani

Leave a Comment