25.7 C
Hyderabad
May 24, 2025 08: 27 AM
Slider ముఖ్యంశాలు

25న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన మావోలు

#Maoist Bundh 1

కవి వరవరరావుతో పాటు భీమా కోరెగావ్ సంఘటన నిందితులు అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు.

మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు. భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని అదేవిధంగా రాజకీయ ఖైదీలను, 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.

Related posts

దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన టీఆర్ఎస్ యువ‌నేత‌

Sub Editor

మేడారం అమ్మవార్ల ముక్కులు తీర్చుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

Satyam NEWS

నిబంధనలకు తూట్లు: గణతంత్ర వేళ బార్లు బార్లా..

mamatha

Leave a Comment

error: Content is protected !!