కవి వరవరరావుతో పాటు భీమా కోరెగావ్ సంఘటన నిందితులు అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు.
మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు. భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని అదేవిధంగా రాజకీయ ఖైదీలను, 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.