సిద్దిపేట జిల్లాలో ఓ కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ పెరిగి పెద్దదిగా మారింది. దీంతో కొడుకు తండ్రిని రోకలితో బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సిద్దపేట జిల్లాలోని నంగునూరు మండలం ఘనపూర్ లో జరిగింది.