కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నా అధికార వైసీపీ తన తీరు మార్చుకోవట్లేదని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లతో గెలిపించారు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలను, చట్టాలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పనితీరును సమీక్షించుకుని, ప్రజలకు సరైన పాలన అందించాలని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా చీమకుట్టినట్టయినా లేదు. చివరకు సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయకుండా తామనుకున్నట్టుగా పరిపాలించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది’ అని సుజనా చౌదరి మండిపడ్డారు.