విధి నిర్వహణ లో మరణించిన హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కుటుంబానికి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అండగా నిలిచారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య భార్య రేణుక కు రూ. 2.70 లక్షల చెక్కును నేడు ఆయన అందజేశారు. శంషాబాద్ సీసీ ఎస్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న చంద్రయ్య 2020 ఏప్రిల్ 17న లివర్ క్యాన్సర్ తో మరణించారు.
చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు 2000 బ్యాచ్ కు చెందిన పోలీసు సిబ్బంది 2.70 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఆ విరాళాన్ని సీపీ అందజేశారు. హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేష్, దుర్గాప్రసాద్, సత్తయ్య, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.