29.7 C
Hyderabad
April 29, 2024 07: 11 AM
Slider చిత్తూరు

రంజాన్ సందర్భంగా శ్రీకాళహస్తిలో MLA ఇఫ్తార్ విందు

#srikalahasti

రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి శ్రీకాళహస్తి పట్టణం,మాసారపు వెంకటసుబ్బయ్య నగర్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో రంజాన్ వస్తున్న సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా ఉదయం నుండి ఉపవాసం ఉన్న ముస్లిం సోదరీమణులు సాయంకాలం ఉపవాస దీక్ష ముగించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందుకు వచ్చిన ముస్లిం సోదరీమణుల భోజన ఏర్పాట్లను దగ్గరుండి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు భారీ ఎత్తున ఇఫ్తార్ విందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఇప్పటివరకు ఏ శాసనసభ్యుడు ముస్లింలకు ఇంత భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఇవ్వలేదని  జగనన్న, మధుసూదన్ రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారు అని అలాగే నిరుపేద  ముస్లిం కుటుంబాల కల్యాణం కొరకు మేనమామ సాంగ్యం అందజేస్తున్నారని తెలిపారు. ఇఫ్తార్ విందులో దాదాపు 5వేలపై చిలుకు ముస్లిం సోదరిమణులు పాల్గొన్నారు.

Related posts

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన గాజువాక ఏ ఎస్ ఐ

Satyam NEWS

అగమ్య గోచరంగా భాషా పండితుల పరిస్థితి

Bhavani

ల్యాండ్ మాఫియా అడ్డా నరేంద్రనగర్ కాలనీ

Sub Editor

Leave a Comment