28.7 C
Hyderabad
April 28, 2024 07: 31 AM
Slider నిజామాబాద్

యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్ల తయారీ

#kamareddypolice

యూట్యూబ్ లో నకిలీ నోట్లను తయారు చేయడం చూసి సాంకేతిక పరిజ్ఞానంతో దొంగనోట్లను తయారు చేసి చలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి టేక్రియాల్ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తవేర AP09BA8339 నంబరు గల వాహనంలో ఉమర్, ఒబైద్ అనే వ్యక్తులు పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని, వారిని వెంబడించి పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు.

మతిన్, హుసేన్, మొయిజ్ లతో కలిసి వాహనంలో దొంగనోట్లను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసిన అనంతరం రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మతిన్, హుసేన్, మొయిజ్ లను తీసుకుని బైంసా వెళ్లగా వారు ఉంటున్న చోట దొంగ నోట్లు, 2 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరివద్ద మొత్తం 330 నకిలీ 500 నోట్లు (1,65,000) స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. మొయిజ్ వద్ద డెడ్ ల్యాప్ టాప్, టివి కీ బోర్డు, ల్యామినేషన్ మిషన్, కెనాన్ కలర్ ప్రింటర్, కెనాన్ ప్రింటర్, డిటిపి ప్రింటర్, స్ప్రే పెయింట్స్, టిన్నర్, గ్రీన్ కోటింగ్ పెయింట్, గ్లాస్ మరియు స్టాండ్, స్క్రీనింగ్ ప్రింటర్ ఇంక్స్, టు సైడ్ ప్లాస్టర్, ఏవిపి గోల్డ్ పాలిష్ కలర్, బొరిక్ యాసిడ్, ఖాళీ కాట్రేజ్, బ్రౌన్ టిప్, కార్టెజ్(07), ఏక్సిక్యూటివ్ బాండ్ పేపర్స్, మింక్ గ్రీన్ రియాక్టివ్ ఫాయిల్, ఐరన్ స్కేల్, హెచ్ పి మౌజ్, ప్లాస్టిక్ స్కేల్, పేపర్ కటింగ్ బ్లేడ్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

దొంగ నోట్ల తయారీలో ఏ1. మహ్మద్ ఉమర్, ధర్మాబాద్, ఏ2. ఒబైద్ ఖాన్ పటాస్, నాగారం, నిజామాబాద్, ఏ3. షేక్ హుసేన్, మహంత పూలే నగర్, బైంసా, ఏ4. మతిన్ ఖాన్, మదీన కాలనీ, బైంసా, ఏ5. అబ్దుల్ మొయిజ్, పందిరిపల్లి, బైంసాకు చెందిన వారుగా పేర్కొన్నారు. ఇందులో ఉమర్, ఒబైద్ లు దొంగ నోట్లను చలామణి చేస్తారని, షేక్ హుసేన్, మతిన్ ఖాన్ నకిలీ కరెన్సీ తయారు చేస్తారని, మతిన్ ఖాన్ సాంకేతిక నిపునిగా ఉంటాడని, అబ్దుల్ మొయిజ్ దొంగనోట్ల తయారీకి అవసరమయ్యే పరికరాలను తన ఇంట్లో దొంగ చాటుగా నిలువ చేస్తాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Related posts

టిఆర్ఎస్ కు బ్రాహ్మణుల మద్దతు

Sub Editor

మద్యంపై మళ్లీ మారనున్న జగన్ ప్రభుత్వం పాలసీ?

Satyam NEWS

అదృష్టాన్ని  పరీక్షించుకోవడానికి సమయం పొడిగింపు

Satyam NEWS

Leave a Comment