ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుండి మరోసారి బిఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను స్థానిక విడివో కాల నీ లోని క్యాంపు కార్యాలయం లో బ్రాహ్మణ సంఘం నాయకులు మాటూరు లక్ష్మీనారాయణ నాయకత్వం లో కలిశారు. పువ్వాడ కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
నగర బ్రాహ్మణులు అంత పువ్వాడ వెంటే నని త్వరలో బ్రాహ్మణ ఆత్మీయ కలయిక నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఇంటి కి వెళ్లి కలుస్తామని చెప్పారు. దేశం లోనే మొదటి సారిగా బ్రాహ్మణులు గుర్తించి కుల సర్టిఫికెట్ ఇవ్వడం తో పాటు.ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక సంక్షేమ పథకం లు అమలు చేసింది,చేస్తోంది,చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని పువ్వాడ స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమం లో మారం రాజురాధాకృష్ణ, శ్రీకాంత్, నందుల వరలక్ష్మి, సుబ్బారావు,రావుల పాటి శ్రీనివాసరావు, శనగపాటి మురళి కృష్ణ, కే అప్పారావు,వల్లూరు సత్యనారయణ,ఏం హరి కిషన్ రావు, వి చంద్ర శేఖర్, ఎస్ వి ,వాసు, బి రామకృష్ణ తదితులున్నారు.