38.2 C
Hyderabad
May 3, 2024 21: 48 PM
Slider జాతీయం

విజయ్ దివస్ సందర్భంగా స్వర్ణ విజయ జ్యోతి

#NarendraModiVijayDiwas

భారత్​-పాకిస్థాన్​ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అంజలి ఘటించారు.

యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించారు. ఈ అఖండ జ్యోతులను 1971 యుద్ధం పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.

1971లో తూర్పు పాకిస్థాన్‌లో స్వతంత్ర పోరు మొదలై భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్‌ను భారత్‌ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది.

ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు.

బుధవారం యుద్ధ స్మారకం వద్ద నిర్వహించిన వేడుకల్లో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ ఏడాదితో భారత్‌ విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణ విజయ సంవత్సరం’గా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

Related posts

ఆక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్

Satyam NEWS

విశ్వనాథ్‌ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి

Murali Krishna

అయినను పోయిరావలె హస్తినకు…: అమిత్ షా రమ్మన్నారోచ్

Satyam NEWS

Leave a Comment