దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకం ఏది? దాని కోసం మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ మేరకు ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం వరుసగా మూడవ సంవత్సరం దేశంలో అత్యధికంగా వ్యక్తులు ఆర్డర్ చేసిన ఆహారం బిర్యానీగా తేలింది. దేశంలోని వివిధ నగరాల్లో 95 రకాల బిర్యానీలను భారతీయులు ఆర్డరు చేశారు.
వీటిలో రూ .19 ముంబై చల్ దానో తవా బిర్యానీ నుండి రూ.1500 విలువ చేసే పూనే చికెన్ సాజుక్ టప్ బిర్యానీ ఉంది. ప్రతి నిమిషం 95 బిర్యానీలను వ్యక్తులు ఆర్డర్ చేస్తున్నారు. స్విగ్గి సర్వే ప్రకారం 2019 సంవత్సరంలో టాప్ టెన్ వంటకాల వివరాలు ఇవి: 1.చికెన్ బిర్యానీ, 2. స్పైసీ కేకులు, 3.పన్నీర్ బటర్ మసాలా, 4.చికెన్ ఫ్రైడ్ రైస్, 5. మటన్ బిర్యానీ, 6. చికెన్ దమ్ బిర్యానీ, 7. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, 8. వెజ్ బిర్యానీ, 9. తందూరి చికెన్, 10. దాల్ మఖనీ