తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంటు పరిధిలో పార్టీ అనుబంధ సంఘం టి ఎన్ ఎస్ ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) పూర్తి పార్లమెంట్ కమిటీని తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఈ కమిటీలో నల్లగొండ పార్లమెంట్ టి ఎన్ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణమునకు చెందిన మిడిశనమెట్ల దుర్గాప్రసాద్ ను నియమించారు.
ఈ సందర్భంగా మిడిశనమెట్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు ఇచ్చినందుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణకు, నెల్లూరి దుర్గా ప్రసాద్ కు, హుజూర్ నగర్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చావా కిరణ్మయికి, పట్టణ టిడిపి అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు చావా సహదేవరావు, పట్టణ టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.