30.2 C
Hyderabad
February 9, 2025 20: 52 PM
Slider ఆధ్యాత్మికం

30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala.Venkateswara.Temple.original.3339

ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ఈ నిబంధన అమలులో ఉంటుంది. దాతలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు వీలుగా ఉచిత బస్సుల సంఖ్యను టీటీడీ పెంచనుంది.

Related posts

పరిపాలనా రాజధానికి ప్రత్యేక బస్సు సర్వీసు

Satyam NEWS

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం 

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Satyam NEWS

Leave a Comment