38.2 C
Hyderabad
April 29, 2024 19: 48 PM
Slider ఆధ్యాత్మికం

30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala.Venkateswara.Temple.original.3339

ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ఈ నిబంధన అమలులో ఉంటుంది. దాతలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు వీలుగా ఉచిత బస్సుల సంఖ్యను టీటీడీ పెంచనుంది.

Related posts

ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సత్యవతి

Satyam NEWS

ఛలో ఢిల్లీ రైతు పోరాటానికి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలి

Satyam NEWS

కృత్రిమ గుండె సృష్టి ఎంత వరకూ వచ్చింది?

Satyam NEWS

Leave a Comment