గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీనిటాటాఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన లారీకి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆటో వేగంగా వచ్చి ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిగింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు