నెల్లూరు జిల్లా కోవూరు దళిత వాడలో దారుణం జరిగింది. అనుమానం పెను భూతమై ఒక పోలీసు కానిస్టేబుల్ ఒక మహిళపై దాడి చేసి గొంతు కోశాడు.
తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి షేకున్ అనే మహిళ కారణమనే అనుమానంతో కానిస్టేబుల్ సురేష్ దాడి చేశాడని పోలీసులు తెలిపారు.
షేకున్ ను వెంటనే హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆమెపై దాడికి పాల్పడ్డ సురేష్ ఆమె గొంతు కోశాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన గురించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉంది.