38.2 C
Hyderabad
May 5, 2024 20: 21 PM
Slider హైదరాబాద్

హింసామార్గం వీడండి అహింసాపద్ధతులను అవలంబించండి

#madarsa

హైదరాబాద్ లోని అంబర్ పేట అలీ కేఫ్ చౌరస్తాలోని మదర్సాలో  తజ్వీద్ ఉల్ ఖురాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడుతూ ప్రజలంతా కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉండాలని, అన్ని మతాలవారు కులాల వారు కలిసికట్టుగా ఉండాలని, శాంతి కోసం పాటుపడాలని,హింస మార్గాన్ని వీడాలని, అహింసా మార్గంలో నడవాలని కులాలకు మతాలకు అతీతంగా సోదరా భావంతో మెలగాలని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మదర్స పెద్దలు అమీరే షరియత్ ఆరిఫ్ బిల్లాహు, హజ్రత్ మౌలానా షాహ్, మహమ్మద్ జమాలో రెహమాన్ సాహెబ్, హాఫీస్ మొహమ్మద్, ముక్తి మహమ్మద్ సులేమాన్, అజ్మల్ సహాబ్ మాజహిరి, వివిధ పార్టీల నాయకులు బాగ్ అంబర్ పేట మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాసిన్ షరీఫ్, లింగారావు, మహేష్ ముదిరాజ్, విష్ణు, సాయి, సంతోష్ చారి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

జనాభా నియంత్రణ పాటిస్తేనే మానవ జాతికి మనుగడ

Satyam NEWS

వర్షానికి ఆటో బోల్తా: యువతి మృతి

Satyam NEWS

మున్నూరు కాపుల భవన నిర్మాణానికి కృషి చేస్తా: సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment