ఏప్రిల్ నాటికి కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు చివ్వేంల మండలం మున్యానాయక్ తండా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ ప్రాంతానికి కాళేశ్వరం జలాలను అందించేందుకు విశేషంగా కృషి చేసిన మంత్రి జగదీశ్ రెడ్డికి వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్యానాయక్ తండా లో తండా యం పి టి సి సాగర్ సుశీల, గ్రామ టి ఆర్ యస్ కమిటీ అధ్యక్షుడు చాంప్లా, శబరినాధ్, నాగ, పచ్చిరం నవీన్ పాల్గొన్నారు.
previous post