పాకిస్తాన్ జైలు నుంచి ఇరవై మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వారు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. జైలులో ఉన్నవేళ మా కుటుంబాలకు నెలకు రూ.9000 ఇస్తున్నందుకు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ అధికారులు వారి జాతీయతను ధృవీకరించిన తర్వాత సద్భావన సూచనగా మత్స్యకారులను విడుదల చేసినట్లు లాంధీ జైలు సూపరింటెండెంట్ ఇర్షాద్ షా తెలిపారు.
మత్స్యకారులు నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపారని, పాక్ ప్రభుత్వం సౌజన్యంతో విడుదల చేశామని ఇర్షాద్ షా తెలిపారు. లాహోర్లోని వాఘా సరిహద్దుకు మత్స్యకారులను తీసుకెళ్లేందుకు ఆది ట్రస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సామాజిక సంక్షేమ సంస్థ ఏర్పాట్లు చేసింది.