నిరుపేద కుటుంబానికి సాయం అందించిన ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. ములుగు మండల కేంద్రం నిరుపేద కుటుంబానికి చెందిన సుడిది మల్లయ్య అనారోగ్యంతో ఇటీవలే మరణించారు. ములుగు మండల సుడిది మల్లయ్య,సుభద్ర దంపతులకు ముగ్గురు కూతుళ్లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొన్ని సంత్సరాల క్రితం సుభద్ర అనారోగ్యంతో మరణించారు.
మల్లయ్య కూలీ పనులు చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకునేవాడు. ఇటీవలే మల్లయ్య కూడా అనారోగ్యంతో మరణించడంతో పిల్లలు ఒంటరిగా మిగిలారు. వీరి పరిస్థితిని గ్రామస్థులు సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు తెలిపారు.
విషయం తెలుసుకున్న తస్లీమా గురువారం వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. అమ్మాయిలకు అన్ని వేళలా అండగా ఉంటానని తస్లీమా తెలిపారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.