అన్ని రంగాలలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కడప నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్ లో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వి.ఎస్ అమీర్ బాబు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వికాష్ హరి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు సానపురెడ్డి శివ కొండారెడ్డి తదితరులు మాట్లాడుతూ వైసిపి పాలనవల్ల ప్రజలు నానా తిప్పలు పడుతున్నారని వారందరికి అండగా తెలుగు దేశం పార్టీ అండగా వుంటుందని తెలిపారు. ప్రజల మీదా, వ్యాపారస్థులపై వీర బాదుడు చేస్తున్న వైసిపి ప్రభుత్వం కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలోవార్డ్ ఇన్చార్జ్ బండి జయశేఖర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యధర్శి సానపు రెడ్డి రవిశంకర్ రెడ్డి టిడిపి నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, అదికార ప్రతినిది అముారి బాలదాసు,మాసా కోందడరామ్,రాష్ట్ర నాయకులు మాసాపేట శివ, జీయాఉద్దీన్, వరప్రసాద్ మేకల వేంకటేసుయాదవ్, కొండా సుబ్బయ్య వార్డు ఇన్చార్జులు జనార్దన్ రెడ్డి, వరదా కీరణ్,రామంజనేయులు,మహిళ నాయకురాలు మురికినాటి సునీతా, వరదా పార్వతి, టి డి పి తదితరులు పాల్గొన్నారు.