33.2 C
Hyderabad
May 15, 2024 22: 54 PM
Slider కడప

తప్పు చేసినట్టు నిరూపిస్తే ఆత్మ హత్య చేసుకుంటా…

#medamallikarjunreddy

అన్నమయ్య జిల్లా రాజంపేట లోని మేడా భవన్ లో మంగళవారం మీడియా సమావేశంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక మాఫియాలో తన కుటుంబ జోక్యం ఉన్నటు చంద్రబాబు నాయుడు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పు కుంటానని అన్నారు. సోషల్ మీడియాలో తమ కుటుంబంపై, వైసీపీ పై ప్రతిపక్షం దృష్ప్రచారం చేస్తున్నారని ఇది అవాస్తవం అన్నారు.

ఆత్మహత్య చేసుకుంటాంగాని, తాను చిన్న తప్పు కూడా చేయనని ధీమా వ్యక్తంచేశారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని యూట్యూబ్ చానల్స్ లో అబద్ధాలు ప్రసారం చేశాయని, తాను తన పార్టీ వారు తమ నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోషల్ మీడియాలో తన పై వచ్చిన దృష్ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేసానని,వారినుంచి సరైన స్పందన లేదని,దీనిపై ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతానని వెల్లడించారు.

Related posts

గ్రామ సచివాలయంకు వాటర్ కూలర్ వితరణ

Satyam NEWS

Breaking News: ఇళ్లపై కూలిపోయిన విమానం: 98 మంది మృతి

Satyam NEWS

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment