అన్నమయ్య జిల్లా రాజంపేట లోని మేడా భవన్ లో మంగళవారం మీడియా సమావేశంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక మాఫియాలో తన కుటుంబ జోక్యం ఉన్నటు చంద్రబాబు నాయుడు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పు కుంటానని అన్నారు. సోషల్ మీడియాలో తమ కుటుంబంపై, వైసీపీ పై ప్రతిపక్షం దృష్ప్రచారం చేస్తున్నారని ఇది అవాస్తవం అన్నారు.
ఆత్మహత్య చేసుకుంటాంగాని, తాను చిన్న తప్పు కూడా చేయనని ధీమా వ్యక్తంచేశారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని యూట్యూబ్ చానల్స్ లో అబద్ధాలు ప్రసారం చేశాయని, తాను తన పార్టీ వారు తమ నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోషల్ మీడియాలో తన పై వచ్చిన దృష్ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేసానని,వారినుంచి సరైన స్పందన లేదని,దీనిపై ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతానని వెల్లడించారు.