వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని,ఆ పార్టీ నుంచి మాధవ్ను సస్పెండ్ చేయాలని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంపీ మాధవ్ నైతిక బాధ్యత వహించి,స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజీనామా చేయకపోగా టీడీపీ నాయకులు హేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.జగన్ పాలన ధృత రాష్ట్ర పాలనను తలపిస్తున్నదని వివరించారు.జగన్ తన సభలలో మాట్లాడుతూ పదేపదే వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారని, ఆయనను చూసుకునే కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నాయకులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఎక్కువ చెడ్డపనులు చేసే వారికే మంత్రి పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఏమి చేసినా ఎన్నికలలో ప్రజలను అంగట్లో బొమ్మలులా కొనవచ్చనే ధీమాతో జగన్ ఉన్నారని వారు అన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారి పై చర్యలు తీసుకునే మహిళా కమిషన్ సైతం ముఖ్యమంత్రి కనుసన్నలలో నడుస్తున్నదని వివరించారు.
ముఖ్యమంత్రి మారితేనే వైసీపీ నాయకులలో మార్పు వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దాసరి ఉదయ్ శ్రీ, కుమ్మేత కోటి రెడ్డి,శాఖమురి మారుతి,బడే బాబు,నాగూర్,సంజీవ్ రావు,అనిల్,రమేష్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.